కూలీల ట్రాలీ ఆటో ఫల్టీ..

by Disha Web Desk 20 |
కూలీల ట్రాలీ ఆటో ఫల్టీ..
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్ : కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తాడూరు మండల పోలీసులు అందులో ప్రయాణిస్తూ తీవ్రంగా గాయపడిన 12 మంది క్షతగాత్రులను తమవాహనంతో పాటు 108 సాయంతో జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బుడోనిపల్లి గ్రామానికి చెందిన అఖిల, నారమ్మ, రమణ, పద్మమ్మ, మమత, సంధ్య, ప్రశాంత్, సాయమ్మతో పాటు మరో ముగ్గురితో కలిసి జమిస్తాపూర్ వద్ద మామిడి కాయలు కోసెందుకు వచ్చారు.

కాగా సాయంత్రం వెల్డండ మండలం కోట్ర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ యాదయ్య ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. తాడూరు మండలం గుంత కోడూరు గ్రామశివారులో ప్రమాదవశాత్తు ట్రాలీ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 12 మంది కూలీలతో పాటు డ్రైవర్ యాదయ్య తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తాడూరు మండల పోలీసులు తమ వాహనంతో పాటు 108 వాహనం సాయంతో క్షతగాత్రులందరినీ జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

Most Viewed