- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పకడ్బందీగా ఎస్ఐఆర్ ప్రక్రియ : కలెక్టర్ బాదావత్ సంతోష్
దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వెల్లడించారు. హైదరాబాద్

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026 ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో బిఎల్ఓలకు శిక్షణ అందించినట్లు తెలిపారు. 2002, 2025 ఓటర్ల జాబితాలను ఆధారంగా తీసుకుని ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తామన్నారు. ఎస్ఐఆర్ నిర్వహణపై సూపర్వైజర్లు, బిఎల్ఓలకు మరిన్ని శిక్షణలు అందిస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, నాగర్కర్నూల్ ఆర్టీవో సురేష్, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, అచ్చంపేట ఆర్డీవో మాధవి, కల్వకుర్తి ఆర్డీవో జనార్ధన్ రెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రవికుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.






