రైతుల‌కు అల‌ర్ట్..రేప‌టి నుంచే విత్తన మేళా

by velandi.Saikiran |

ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని రైతు వేదికలలో విత్తన మేళా జ‌రుగ‌నుంది.

రైతుల‌కు అల‌ర్ట్..రేప‌టి నుంచే  విత్తన మేళా
X

దిశ, వంగూరు: ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని రైతు వేదికలలో విత్తన మేళా నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి ప్రియదర్శిని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను ఒకేచోట అందుబాటులో ఉంచే ఉద్దేశంతో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విత్తన మేళాలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాల వరి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులు తమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించబడిందన్నారు. కావున మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వంగూరు, రంగాపూర్, పోల్కంపల్లి గ్రామాలలోని రైతులు సమీప రైతు వేదికలను సందర్శించి నాణ్యమైన విత్తనాలను పొందాలని సూచించారు.

Next Story