ఎమ్మెల్యే మర్రికి అభిమాని అరుదైన కానుక..

by Disha Web Desk 11 |
ఎమ్మెల్యే మర్రికి అభిమాని అరుదైన కానుక..
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఓ అభిమాని అరుదైన కానుకను అందించారు. బీచ్ లో ఉండే ఇసుకను తెచ్చి ఎమ్మెల్యే చిత్రాన్ని గీసి జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ మీద ప్రదర్శించాడు. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి సాగునీరు, మెడికల్ కళాశాల, సొంత నిధులతో పాఠశాల నిర్మాణం, పేద జంటలకు పెళ్లిళ్లు అనే అంశాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అందుకే ఆయనపై అభిమానం పెంచుకొని ఈ విధంగా ఇసుకమేటపై ఎమ్మెల్యే చిత్రాన్ని గీసి సామ ముకేష్ అనే అభిమాని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు.



Next Story