తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. తునాతునకలైన మృతదేహాలు

by Web Desk |
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. తునాతునకలైన మృతదేహాలు
X

దిశ, కల్వకుర్తి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ కు చెందిన కిరణ్మయి(22), కొండమల్లేపల్లికి చెందిన అన్నిపాక అరవింద్(23 ), నల్గొండ జిల్లా పీఏ పల్లికి చెందిన శిరీష(20), రేణుక(20).. ఈ నలుగురు కలిసి గురువారం కల్వకుర్తి డివిజన్ వెల్డండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో జరిగిన వారి స్నేహితుడు విజయ్ వివాహానికి హాజరయ్యారు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బయలుదేరుటకు కల్వకుర్తి నుంచి జడ్చర్ల మీదుగా 167 జాతీయ రహదారిలో తిరుగు ప్రయాణమై కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ సమీపంలోని హ్యాట్సాప్ మిల్క్ సెంటర్ దాటాక దాదాపు ఉదయం 4.30 గంటల సమయంలో కల్వర్టు వద్ద మూలమలుపు క్రాస్ చేసే క్రమంలో కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అరవింద్, శిరీష, కిరణ్మయిలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలు కారు బోల్తా కొట్టడంతో తునాతునకదిశ, కల్వకుర్తి: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.లయ్యాయి. రేణుకకు తీవ్ర గాయాలవ్వడంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని సీఐ రామకృష్ణ, ఎస్ఐ మహేందర్ లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Next Story

Most Viewed