1500 కేజీల నల్లబెల్లం.. 200 కేజీల పటిక స్వాధీనం..

by Disha Web Desk 20 |
1500 కేజీల నల్లబెల్లం.. 200 కేజీల పటిక స్వాధీనం..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో ఒక వాహనంలో అక్రమంగా నల్లబెల్లం సరఫరా చేస్తున్నారని సమాచారం అందడంతో వాహనాలను తనిఖీ చేశామని ఎక్సైజ్ శాఖ ఎస్సై బాలరాజు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చంపేట మండల పరిధిలోని ఎద్దు మిట్ట తండాకు చెందిన ఒక వ్యక్తి అశోక్ లేలాండ్ డీసీఎం వాహనంలో 50 బ్యాగులల్లో నల్ల బెల్లం 1500 కేజీలు, నాలుగు బ్యాగులల్లో అనగా 200 కేజీల పటిక అక్రమంగా తరలిస్తుండగా తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. డీసీఎం వాహనంతో పాటు తులసి రామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, వాహన డ్రైవర్ తప్పించుకుని వెళ్లాడని ఆయన తెలిపారు. వారిపై కేసునమోదు చేశామన్నారు. తనిఖీల్లో ఎస్సై సతీష్ కుమార్ సిబ్బంది ఆంజనేయులు, పరమేష్ ఉన్నారని తెలిపారు.


Next Story