ఎల్ఎల్ఎం అడ్మిషన్ల రెండవ దశ సీట్ల కేటాయింపు

by Muthe.Rajitha |

ఎల్ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత సీట్ల కేటాయింపును టీజీసెట్స్ అడ్మిషన్స్-2025 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగార రెడ్డి విడుదల చేశారు.

ఎల్ఎల్ఎం అడ్మిషన్ల రెండవ దశ సీట్ల కేటాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎల్ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత సీట్ల కేటాయింపును టీజీసెట్స్ అడ్మిషన్స్-2025 కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగార రెడ్డి విడుదల చేశారు. రెండో విడతలో 1823 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, 277 మందికి సీట్లు కేటాయించారు. రెండో విడతలో కన్వీనర్ కోటా కింద మొత్తం 282 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 7 లోగా తమకు కేటాయించన కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలని కన్వీనర్ సూచించారు. ఎల్ఎల్ఎం తరగతులు అక్టోబర్ 23 నుండి ప్రారంభమయ్యాయి.

Next Story