'అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం'

by Disha Web Desk 4 |
అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం
X

దిశ, ఉప్పునుంతల: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ రాష్ట్ర నాయకులు వేముల నరేందర్ రావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ కొండల్ రెడ్డి, అచ్చంపేట నియోజకవర్గం బీజేపీ నాయకులు శ్రీకాంత్ భీమా అన్నారు. ఉప్పునుంతల మండలం పెద్దాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజా గోస - బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు సుస్థిర పాలన అందించే పార్టీ బీజేపీ పార్టీయే అని తెలిపారు. ఈ కార్నర్ మీటింగ్ అనంతరం పార్టీ లోగోను ఆవిష్కరించారు. కమలం పువ్వు గుర్తును ప్రతి బూత్‌లో, ప్రతి వీధిలో ప్రతి ఇంటిపై వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జగపతి రావు, మైనారిటీ మోర్చ నాయకులు సుల్తాన్, శక్తి కేంద్ర ఇంచార్జీ, బూత్ అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed