రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతాం.. అడ్డుకున్న వారి వీపులు పగుల్తయ్! సీఎం రేవంత్ రెడ్డి

by Geesa Chandu |

తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తీరుతామని.. సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతాం.. అడ్డుకున్న వారి వీపులు పగుల్తయ్! సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సచివాలయం లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తీరుతామని.. సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు. దీనిని ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే వారి వీపులు పగుల్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. బీఆరెస్ నేతలు గత పదేళ్లలో తెలంగాణ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని మండి పడ్డారు. డిసెంబర్ 9 వ తేదీన రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశం మొత్తాన్ని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఇద్దరు.. అంబానీ, అదానీలకు దోచి పెడుతున్నారని దుయ్యబట్టారు. సెబీ అక్రమాల గురించి కేసీఆర్, కేటీఆర్ లు ఎందుకు మాట్లాడడడం లేదని సీఎం రేవంత్ అన్నారు.

Next Story