- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తెలంగాణలో టీడీపీని అధికారంలోకి తెద్దాం: నేతలకు కాసాని కీలక పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొద్దామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, విస్మరించిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ అధికార ప్రతినిధిగా బుడిగి అనూప్, రాష్ట్ర మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా హబీబ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శులుగా ఏ.సురేందర్ సింగ్, కుర్ర ధనలక్ష్మి, నంబూరి సూర్యం, ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జీగా తలారి శ్రీకాంత్ను నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. కష్టపడేవారికి పార్టీలో గుర్తింపు లభిస్తుందన్నారు. టీడీపీ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, వెంకటేష్, శ్రీపతి సతీష్, రాఘవేంద్రప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.