బస్సు యాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసిన కేసీఆర్ ను ప్రజలు నమ్మరు: బీజేపీ లక్ష్మణ్

by Disha Web Desk 13 |
బస్సు యాత్ర కాదు మోకాళ్ల యాత్ర చేసిన కేసీఆర్ ను ప్రజలు నమ్మరు: బీజేపీ లక్ష్మణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో:మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 22 నుంచి తలపెట్టిన బస్సు యాత్ర పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు విమర్శలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బస్సు యాత్ర కాదు కదా మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ ను ప్రజలు నమ్మె పరిస్థితితుల్లో లేరని సెటైర్ వేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్ లో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్ లా మారాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సొంత ఎమ్మెల్యేల పట్ల సీఎంకు అభద్రతా భావం ఎందుకని నిలదీశారు. 100 రోజుల తమ పరిపాలనను రెఫరెండంగా చేసుకుని 14 ఎంపీ స్థానాలు గెలుస్తామన్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. కనుమరుగు అవుతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనూ గెలిచే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో బీజేపీ 12 స్థానాల్లో గెలవబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి, మోడీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు. అందువల్లే మోడీ చర్మిష్మా తగ్గించి చూపేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయని ధ్వజమెత్తారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నానని చెప్పిన 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారని ఈ రెండు పార్టీలు కలిసి గేమ్ ఆడుతున్నాయని ఆరోపించారు.నిన్న జరిగిన మొదటి ధపా ఎన్నికల్లో బీజేపీ పార్టీ 50 శాతం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుందనే నమ్మకం ఉందన్నారు.

Next Story

Most Viewed