వాళ్లను నేను గుడ్డిగా నమ్మాను.. KTR సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
వాళ్లను నేను గుడ్డిగా నమ్మాను.. KTR సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మారిన నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పు వార్తలపై రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి ముందే ప్రశ్నించానని.. ఆ సమయంలో వాళ్లిద్దరూ ఆస్కార్ రేంజ్‌లో నటించారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారబోము అని చెప్పారని అన్నారు. వాల్ల మాటలను తాను పిచ్చివాడిలా నమ్మానని ఆవేదన చెందారు. కానీ, 15 రోజుల్లోనే జెండా మార్చేశారని సీరియస్ అయ్యారు. ఇలాంటి మళ్లీ పార్టీలోకి వస్తామని కేసీఆర్ కాళ్లు పట్టుకొని బతిమిలాడినా చేర్చుకోమని తెగేసి చెప్పారు. పదేళ్ల పాటు పదవులు అనుభవించి పార్టీలు మారారని సీరియస్ అయ్యారు. ఇక నుంచి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తుల గురించి తాను మాట్లాడబోను అని అన్నారు.


Next Story

Most Viewed