- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టన్నెల్ ప్రమాదం ముందే తెలుసు.. నిజాలు దాచిన ప్రభుత్వం: కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్ఎల్బీసీ (SLBC tunnel accident) టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన ప్రభుత్వం నిజాలను దాచి ఉంచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం (x) ఎక్స్ ఖాతా ఆసక్తికర పోస్ట్ చేశారు. ఎస్ఎబీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే రెండు నివేదికలు హెచ్చరించిన ప్రభుత్వం పట్టించుకోలేదని వెల్లడించారు. కార్మికుల ప్రాణాలను పనంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని తెలిపారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని (Red Zone) రెడ్ జోన్గా ప్రకటిస్తూ గతంలో రెండు నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్న కేవలం కమిషన్ల కోసమే పనులను నిర్వహించిందని ఆరోపించారు.
నివేదికల్లో చెప్పిన తీరుగా ఆ ప్రాంతంలోనే ప్రమాదం జరిగిందన్నారు. 8 మంది కార్మికుల కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం అయ్యిందన్నారు. అదేవిధంగా వేలకోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మొత్తం క్యాబినెట్ ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు నివేదికల అంశంపైన ప్రభుత్వం స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరిపించాలని, ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజల తరఫున ఈ అంశంపై పూర్తి వివరాలు విడుదల చేసి ప్రమాదానికి బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.