- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
KTR: తుఫానులా తిరిగి అధికారంలోకి వస్తాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

దిశ, వెబ్డెస్క్: రాబోయే ఎన్నికల్లో తుఫానులా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశంపై గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) అంటేనే మోసమని.. ప్రజలకు అర్ధం అయిందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చానా గులాబీ పార్టీదే అధికారమని తెలిపారు.
తెలంగాణ బీజేపీ (BJP) నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నా.. ఒకరు సహాయ మంత్రి, ఇంకొకరు నిస్సహాయ మంత్రి అంటూ కామెంట్ చేశారు. వారిద్దరితో రాష్ట్రానికి రూపాయి కూడా ఉపయోగం లేదని అన్నారు. గత పదేళ్ల కాలంలో జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిందని, హైదరాబాద్ ప్రజల ముందు బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) డ్రామాలు పని చేయవని అన్నారు. హైడ్రా (HYDRA) పేరుతో రేవంత్ సర్కార్ నగరంలో విధ్వంసం సృష్టిస్తోందని.. శని, ఆదివారాల్లో ప్రజలెవరూ కూల్చివేతలపై కోర్టులకు వెళ్లకుండా కూల్చివేతలకు చేపడుతోందని అన్నారు. ఫలితంగా హైదరాబాద్ (Hyderabad)లో రియల్ ఎస్టేట్ (Real Estate) కుదేలైందని అన్నారు. ఢిల్లీ (Delhi)కి మూటలు మోసేందుకు మూసీ సుందరీకరణ (Musi Beautification) అంటూ ఫైర్ అయ్యారు.
హెచ్సీయూ (HCU) భూములపై సర్కార్ కన్నేస్తే.. విద్యార్థులు ఏకమై పోరాటం చేశారని.. వారికి బీఆర్ఎస్ (BRS) కూడా మద్దతు తెలిపిందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ (KCR) పదేళ్ల పాటు సీఎంగా ఉన్నారని.. భవిష్యత్తులో కూడా ఆయన సీఎం అని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ (National Herald) కేసులో సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi)ల పేర్లను ఈడీ (ED) చార్జిషీట్ (Charge Sheet)లో నమోదు చేస్తే.. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని ఆరోపించారు. చోటే భాయ్.. బడే భాయ్కి మధ్య ఉన్న స్నేహం ఇక్కడ బట్టబయలైందని అన్నారు. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ (BRS) బాయికాట్ చేస్తున్నాయని.. పార్టీ తరఫున కౌన్సిలర్లకు విప్ జారీ చేస్తామని అన్నారు. ఒకవేళ విప్ను ధిక్కరించి ఎవరైనా ఓటింగ్లో పాల్గొంటే వారిపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అన్నారు.