కేటీఆర్ వి దొంగ దీక్షలు.. ప్రభుత్వ విప్ ​బీర్ల ఐలయ్య

by Ramesh Goud |

బీఆర్​ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్​వి దొంగ దీక్షలు అని ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య అన్నారు.

కేటీఆర్ వి దొంగ దీక్షలు.. ప్రభుత్వ విప్ ​బీర్ల ఐలయ్య
X

దిశ, తెలంగాణ బ్యూర్​ : బీఆర్​ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​ కేటీఆర్​వి దొంగ దీక్షలు అని ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య అన్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే ఓర్వలేకనే కేటీఆర్ ధర్నాల పేరుతో షో చేస్తున్నాడని విమర్శించారు. బుధవారం గాంధీ భవన్​లో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులతోపాటు రైతు కూలీలకు సైతం ప్రభుత్వం సాయం అందిస్తేంటే కేటీఆర్​జీర్ణించుకోలేకపోతున్నాడని విమర్శించారు. ‘‘గతంలో కేసీఆర్​ప్రతి రైతుకు యూరియా ఫ్రిగా ఇస్తానని.. ఇయ్యాలే ఆయమీదేందుకు ధర్నా చేయలేదని’’ కేటీఆర్​ను ప్రశ్నించారు.

గతంలో బీఆర్​ఎస్​ రుణమాఫీ చేయకపోవడంతోనే కాంగ్రెస్​ప్రభుత్వంపై భారం పడిందన్నారు. కేటీఆర్​కు నల్లగొండ మంత్రులపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ‘‘అయ్యా చాటుతో ఎమ్మెల్యే, మంత్రి అయ్యావు.. మామ పేరుతో అల్లుడు హరీష్​మంత్రి అయ్యారు’’ అని ఐలయ్య దుయ్యబట్టారు. త్యాగాలు చేసిన ఉత్తమ్​కుమారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఉమ్మడి నల్లగొండకు పేరు తీసుకొచ్చారని, బంగారుకొండగా ఇటీవల ఉదయ సముద్రాన్ని ప్రారంభించుకున్నామన్నారు. రైతుల నుంచి ఆధరణను చూసి ఓర్వలేక కచర కేటీఆర్​..మళ్లీ కచర వేశాలతో రైతులను పక్కదొవ పట్టించేందుకు ముసలీ కన్నీరు కారుస్తున్నాడని ఆరోపించారు.

Next Story