తుర్కియే, సిరియా భూకంపాలపై Minister KTR ఆవేదన

by Disha Web Desk 2 |
తుర్కియే, సిరియా భూకంపాలపై Minister KTR ఆవేదన
X

దిశ, డైనమిక్ బ్యూరో: టర్కీ, సిరియా భూకంపాలు తీవ్రంగా కలిచివేశాయంటూ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసిన తుర్కియే, సిరియాల్లో సంబవించిన వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య 5000కు పైగా చేరింది. దీనిపై మంగళవారం ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. 'టర్కీ, సిరియా విధ్వంసం దృశ్యాలు చూసి షాక్ అయ్యాను. ఆ దేశాల్లో వేలాది మంది చనిపోయినట్లు వస్తున్న వార్తలు చూసి బాధ కలుగుతోంది. ఇది నిజంగా మానవాళికి చాలా బాధాకరమైన రోజు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Also Read..

మీ అభిమానం మీద ఒట్టు.. ఎందాకైనా పోరాడుతా: Revanth Reddy


Next Story