మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

by Disha Web Desk 19 |
మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్‌కు దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని ఇన్విటేషన్​అందింది. జూన్ 7, 8వ తేదీల్లో ఈ ప్రదర్శన జుమేరా ఎమిరేట్స్ టవర్, దుబాయ్‌లో జరుగుతుంది. దుబాయిలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఆరోగ్య రంగం, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్ ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవాలను, వాటి ఫలితాలను ఈ సమావేశంలో ప్రదర్శిస్తారు. దుబాయ్‌కి అత్యంత కీలకమైన ఈ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాథమికంగా చర్చించడంతో పాటు, వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ అనుభవాలను వివరిస్తారని నిర్వాహకులు తెలిపారు.

మంత్రి కే తారకరామారావు హాజరు కావడం ద్వారా దుబాయ్‌లో ఉన్న భారతదేశ, ముఖ్యంగా తెలుగు ప్రవాస భారతీయ టెక్నాలజీ రంగ నిపుణులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందని తెలిపారు.

తెలంగాణ అనుభవాల నుంచి విదేశాలతో పాటు ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికన్ రీజియన్ వంటి ప్రాంతాల నుంచి వస్తున్న ప్రతినిధులు స్ఫూర్తి పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. 41వ గ్లోబల్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు ప్రధానం చేయనున్నారు.

Next Story

Most Viewed