బెంగళూరులో ప్రతిష్టాత్మక సదస్సు.. చీఫ్ గెస్ట్‌గా రావాలని కేటీఆర్‌కు ఆహ్వానం

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు ప్రతిష్టాత్మక సదస్సులో కీలక ప్రసంగం చేయాలని ఆహ్వానం లభించింది.

బెంగళూరులో ప్రతిష్టాత్మక సదస్సు.. చీఫ్ గెస్ట్‌గా రావాలని కేటీఆర్‌కు ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR)కు ప్రతిష్టాత్మక సదస్సులో కీలక ప్రసంగం చేయాలని ఆహ్వానం లభించింది. టెక్ & ఇన్నోవేషన్ సమ్మిట్(TIS) 2025‌కు కేటీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సదస్సు 2025 ఫిబ్రవరి 27-28 తేదీల్లో బెంగళూరులో జరగనుంది.

సదస్సు తొలి రోజున, Driving Digital India: Innovations & Strategies for a Technologically Advanced Future అనే అంశంపై కేటీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. “ది ఏఐ టెకేడ్ (Techade)” థీమ్‌తో నిర్వహించనున్న ఈ సమిట్‌లో, కృత్రిమ మేధస్సు (AI) వ్యాపారం మరియు సాంకేతికతపై చూపించే ప్రభావంపై ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాలు ప్రతినిధులు చర్చించనున్నారు.

ఈ ఈవెంట్‌లో 150 పైచిలుకు ప్రముఖ స్పీకర్లు పాల్గొనడంతో పాటు AI, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆటోటెక్, స్పేస్‌టెక్, హెల్త్‌టెక్ వంటి రంగాల్లో విశేషమైన సెషన్లు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, ప్రతిష్టాత్మక గాలా ఐడియా అవార్డ్స్ కార్యక్రమం కూడా ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Next Story