సికింద్రాబాద్ పార్లమెంట్ సమన్వయకర్తలను ప్రకటించిన కేటీఆర్

by Disha Web Desk 1 |
సికింద్రాబాద్ పార్లమెంట్ సమన్వయకర్తలను ప్రకటించిన కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయకర్తలను నియమించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం వారు పేర్లను ప్రకటించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు పార్టీ సీనియర్ నాయకుడు షేక్ అబ్దుల్లా సోహెల్, సికింద్రాబాద్‌కు రాష్ట్ర ఫుడ్స్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్, అంబర్‌పేట్‌కు పార్టీ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్, సనత్‌నగర్‌కు పార్టీ రాష్ట్ర నాయకుడు వెంకట్‌రెడ్డి, ముషీరాబాద్‌కు మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎండీ సలీం, నాంపల్లికి మాజీ మంత్రి మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఖైరతాబాద్‌కు పార్టీ సీనియర్ నాయకుడు ఎం.ఎన్ శ్రీనివాస్‌రావు‌లను నియమించారు. అదే విధంగా కార్పొరేట్ డివిజన్లకు సమన్వయకర్తలను నియమించారు. వెంకటేశ్వర కాలనీకి కార్పొరేటర్ మన్నే కవితా‌రెడ్డి, ఖైరతాబాద్‌కు పార్టీ సీనియర్ నాయకుడు మన్నే గోవర్ధన్‌రెడ్డి, జూబ్లీహిల్స్‌కు కార్పొరేటర్ వెంకటేష్, బంజారాహిల్స్‌కు కార్పొరేషన్ మాజీ చైర్మన్ విప్లవ్ కుమార్, హిమాయత్ నగర్‌కు పార్టీ సీనియర్ నేత హేమలత బాబుయాదవ్, సోమజిగూడ‌కు పార్టీ సీనియర్ నాయకుడు ఆశిష్ యాదవ్‌ను బీఆర్ఎస్ అధిష్టానం నియమించింది.



Next Story

Most Viewed