- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేఆర్ఎంబీ సమావేశం ఆకస్మిక వాయిదా: జలసౌధలో జరగాల్సిన భేటీ రద్దు
హైదరాబాద్ జలసౌధలో జరగాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) సమావేశం అనివార్య కారణాలతో వాయిదా పడింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్లోని జలసౌధలో బుధవారం నిర్వహించాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB) సమావేశం వాయిదా పడింది. ఈ మేరకు కేఆర్ఎంబీ అధికారులు అధికారికంగా సమాచారం విడుదల చేశారు. అయితే, ఈ సమావేశాన్ని ఏ కారణాల వల్ల వాయిదా వేశారన్న విషయంపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. అదేవిధంగా, తదుపరి సమావేశాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే తేదీని కూడా ప్రకటించలేదు. కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల నిర్వహణ, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగాల్సి ఉంది. అకస్మాత్తుగా సమావేశం వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొనాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో పంపిణీ అంశాల పరిష్కారానికి మరికొంత కాలం వేచి చూడాల్సి వస్తోంది.
Next Story






