కాంగ్రెస్ సీనియర్లకు రాజగోపాల్ రెడ్డి ఆహ్వానం

by Disha Web Desk 2 |
కాంగ్రెస్ సీనియర్లకు రాజగోపాల్ రెడ్డి ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌పై మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలకు ముందు కేటీఆర్ మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. చండూరుకు రెవెన్యూ డివిజన్ హామీ ఏమైంది అని ప్రశ్నించారు. మద్యం, డబ్బులు పంపిణీ చేసి, మునుగోడు ప్రజలను మభ్యపెట్టి గెలిచారని విమర్శించారు. ఉప ఎన్నికల సమయంలో మునుగోడు వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర మంత్రులు నియోజకవర్గానికి ఏం చేశారని అడిగారు. వందశాతం పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి డబ్బులకే కొనుగోలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ గురించి మాట్లాడినప్పుడు ఎవరూ నమ్మలేదని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చక కాంగ్రెస్‌లో గుర్తింపులేకుండా మిలిగిపోతున్న సీనియర్ కాంగ్రెస్‌ నేతలారా బీజేపీలోకి రండి అంటూ రాజగోపాల్ రెడ్డి ఆహ్వానించారు. కేసీఆర్ అవినీతిని బయటకు తీయాలంటే బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసినా.. బీఆర్ఎస్‌కు ఓటేసినా ఒక్కటే అని అన్నారు.

ఫ్లాష్.. ఫ్లాష్.. టీ-కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం....MLA సీతక్క సహా ఒకేసారి 13 మంది కీలక నేతలు రాజీనామా

Next Story

Most Viewed