హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ

by Ramesh Naini |

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమం ప్రారంభం అయింది.

హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సీఎంతో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ,హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, రాజ్య సభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, ఎమెల్సీ బల్మూర్ వెంకట్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో 25 ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపట్టిన ప్రభుత్వం.. 1370 మంది గ్రూప్-3 విజేతలకు నియామక పత్రాలు అందజేశారు.

Next Story