దొంగలకు గేట్లు ఓపెన్ చేస్తే మా లాంటి నాయకులు చచ్చిపోతారు.. రేవంత్ రెడ్డి ముందే కేఎల్ఆర్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 13 |
దొంగలకు గేట్లు ఓపెన్ చేస్తే మా లాంటి  నాయకులు చచ్చిపోతారు.. రేవంత్ రెడ్డి ముందే కేఎల్ఆర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:కాంగ్రెస్ పార్టీలో చేరికల అంశం హాట్ టాపిక్ గా మారింది. పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తాము గేట్లు ఓపెన్ చేశామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశం అయ్యాయి. ఈ నేపథ్యంలో చేరికలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఎదుటే సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మీరు డోర్లు తెరుస్తామని అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా పార్టీ లోపలికి తీసుకువస్తే మా లాంటి నాయకులు, కార్యకర్తలు మళ్లీ చనిపోయే ప్రమాదం ఉంది' అని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు. అలాగే రేవంత్ రెడ్డికి కేఎల్ఆర్ కు పడటం లేదని ప్రచారం జరుగుతోందని కానీ నిజానికి తామిద్దరం చాలా దగ్గరి వారిమని చెప్పారు.



Next Story