- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అమిత్ షా పర్యటన రద్దుకు కారణం ఇదే.. కిషన్ రెడ్డి క్లారిటీ
దిశ, వెబ్డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన అనూహ్యంగా రద్దు అయిన విషయం తెలిసిందే. తాజాగా.. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అత్యవసర పనుల వల్ల అమిత్ షా పర్యటన వాయిదా అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ముందే ఫిక్స్ చేసుకున్న కరీంనగర్, మహబూబ్నగర్, హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన సభలు, సమావేశాలు కూడా రద్దు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికలను లైట్ తీసుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ చేసింది. ఏకంగా 12 స్థానాలపై దృష్టి సారించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే అమిత్ షాను రంగంలోకి దింపి మూడు సభల్లో పాల్గొనే వ్యూహాలు రచించింది. అయితే కొన్ని అత్యవసర పనుల వల్ల అమిత్ షా పర్యటన రద్దు అయ్యింది. దీంతో మరో తేదీలో అమిషా తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.