బ్రేకింగ్: టీ-బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ విడుదలపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

by Satheesh |
బ్రేకింగ్: టీ-బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ విడుదలపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తులు ముమ్మరం చేసింది. బహుషా ఈనెల రెండో వారం తర్వాత బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేసే అవకాశముందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అయిన తర్వాత కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన నాంపల్లి పార్టీ ఆఫీస్‌లో రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 6వ తేదీన జేపీ నడ్డా అధ్యక్షతన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.

ఈ రెండు సమావేశాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించనున్నట్లు స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికలకు గాను రాష్ట్ర నాయకులకు నడ్డా నాయకులకు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికపై లోతుగా చర్చ జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఖరారైన అభ్యర్థుల వివరాలను బీజేపీ పార్లమెంటరీ పార్టీ కమిటీకి పంపుతామని వెల్లడించారు. అక్కడ ఫైనల్ అయిన తర్వాత ఢిల్లీ నుంచే అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Next Story

Most Viewed