మునుగోడు ప్రచారంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
మునుగోడు ప్రచారంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థుల ఆత్మబలిదానాలు చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఏమాత్రం త్యాగం చేయని కేసీఆర్ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తోందని అన్నారు. తెలంగాణ పోరాటం చేసిన నిఖార్సైన ఉద్యమ కారులను టీఆర్ఎస్ సర్కార్ పార్టీలోంచి తీసేస్తున్నారని అన్నారు. విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేసింది కేసీఆర్ కుటుంబం కోసమేనా? అని ప్రశ్నించారు. ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తులు ప్రభుత్వంలో పదవులు పొంది ఎక్కడ ఖాళీ జాగా కనపడ్తే అక్కడ కబ్జా చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ దోచుకుని అప్పుల పాలు చేశారని అన్నారు. జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ విమానాల్లో తిరుగుతూ రాష్ట్ర ప్రజల సంపదను దేశంలోని ఇతర రాష్ట్రాలకు పంచి పెడుతున్నారని మండిపడ్డారు.



Next Story