Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Muthe.Rajitha |

బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పాలనలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పాలనలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సోమజిగూడలో కాంగ్రెస్ "6 అబద్దాలు-66 మోసాలు" పేరుతో బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేశారు. బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడా లేదని ఆయన విమర్శించారు. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలం అయితే.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం అయిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలు తాము తప్పు చేశామనే భావనలో ఉన్నామని బాధపడుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story