భట్టికి భీమ్లా నాయక్ పాట వినిపించిన కిన్నెర మొగులయ్య.. ఎందుకంటే?

by Disha Web Desk 14 |
భట్టికి భీమ్లా నాయక్ పాట వినిపించిన కిన్నెర మొగులయ్య.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పద్మశ్రీ అవార్డు గ్రహిత దర్శనం మొగులయ్య డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్కను కలిశారు. ఇవాళ డిప్యూటీ సీఎం భట్టీని ఆయన చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పింఛన్ ఇప్పించాలని, తనకు తన కుమారుడికి సహాయం చేయాలని ఆయన డిప్యూటీ సీఎంను కోరారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా దర్శనం మొగిలయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బీమ్లా నాయ‌క్ సినిమాలో తాను రాసి.. పాడిన పాట‌ను ఈ సంద‌ర్భంగా డిప్యూటి సీఎంకు పాడి వినిపించారు.

కాగా, కిన్నెర మొగులయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెట్ల కిన్నెర కళాకారుడు. ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శలను ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2015లో గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. భారత ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.


Next Story

Most Viewed