- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి..
by Kodari Anjali |
రూరల్ మండలం తల్లంపాడు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.

X
దిశ, ఖమ్మం రూరల్: రూరల్ మండలం తల్లంపాడు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బైక్పై ప్రయాణిస్తున్న యువకుడు ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన వ్యక్తిని కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన అజయ్గా గుర్తించారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రమాదవశాత్తు బైక్పై నుంచి కింద పడిపోయాడా, లేక గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






