గైర్హాజరైతే చర్యలు తీసుకుంటాం: కలెక్టర్

by Kodari Anjali |

ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలని, గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు.

గైర్హాజరైతే చర్యలు తీసుకుంటాం: కలెక్టర్
X

దిశ, కొత్తగూడెం టౌన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని, గైర్హాజరైతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. సంబంధిత శాఖాధికారులు ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా ప్రజల సౌకర్యార్థం సబ్ కలెక్టర్ భద్రాచలం కార్యాలయంలో, ఆర్డీవో కార్యాలయం కొత్తగూడెంలో ప్రజావాణి నిర్వహించబడుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Next Story