Kodandaram : నియంత కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి

by Disha Web Desk 15 |
Kodandaram : నియంత కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
X

దిశ, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అరాచక నియంత కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలో తెలంగాణ యూత్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ యువజన సింహ గర్జన మహాసభ నిర్వహించారు. ఈ సభకు అయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జీవితాలు మారుతాయని కలలు కన్న యువత కు కేసీఅర్ అన్యాయం చేశారని అన్నారు. ఎస్పీఎస్సీ వైఫల్యం అవినీతి ప్రభుత్వం వల్ల ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది అని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనం చేస్తూ ఊరూరా బెల్ట్ షాప్ లు

పెట్టి మద్యం కు బానిసలుగా మార్చారని ఆవేదన వ్యక్తంచేశారు. తుమ్మల విజయం కోసం సంఘీభావంగా ఈ సభకు వచ్చానని తెలిపారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల కు సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో నే ప్రజాస్వామిక తెలంగాణ సాధ్యం అవుతుందన్నారు. అనంతరం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమానికి రథ సారధి గా కోదండరాం చరిత్రలో నిలిచారని కొనియాడారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తి కాదని ,నిరంతరం తెలంగాణ ప్రయోజనం కోసం పాటుపడే మేధావి కోదండరాం అన్నారు. కోదండరాం నినదించిన ప్రజాస్వామిక తెలంగాణ కాంగ్రెస్ గెలుపు తోనే సాధ్యమన్నారు. తనకు మద్దతు ప్రకటించిన ప్రొఫెసర్ కోదండరాం గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story