జూలై 4న మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు

by Taduka Kalyani |

మధిర మండలంలోని ఖాజీపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే. సాంబయ్య తెలిపారు.

జూలై 4న మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
X

దిశ, మధిర : మధిర మండలంలోని ఖాజీపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కే. సాంబయ్య తెలిపారు. 2026 లేదా అంతకుముందు ఎస్‌ఎస్‌సీ (10వ తరగతి) ఉత్తీర్ణులైన విద్యార్థులు స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరై ప్రవేశాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు తమ అసలు విద్యార్హత సర్టిఫికెట్లతో ఖాజీపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 9010222181, 9848958830 నంబర్లలో సంప్రదించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

Next Story