8కిలోల గంజాయి స్వాధీనం: నలుగురు అరెస్ట్

by Disha Web Desk 1 |
8కిలోల గంజాయి స్వాధీనం: నలుగురు అరెస్ట్
X

దిశ, జూలూరుపాడు: ద్విచక్ర వాహనాలపై గంజాయిని తరలిస్తూ నలుగురు పోలీసులకు పట్టుబడిన ఘటన జూలురుపాడు వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని నాయక్ రైస్ మిల్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వెనక్కి పారిపోతుండగా వారిని చూసి వెనక్కి పారిపోతుండగా పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న లగేజీని పరిశీలించి ఎనిమిది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ద్విచక్ర వాహనాలను స్టేషన్ కు తరలించి సీజ్ చేసి నలుగురుపై కేసు నమోదు చేశారు. గంజాయి తో పట్టుబడ్డ నలుగురు వ్యక్తులు మత్తుకు అలవాటు పడి గంజాయిని ఎక్కువ రేటుకు కొనుగోలు చేయలేక ఒరిస్సా రాష్ట్రానికి వెళ్లి స్వయంగా గంజాయి తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.



Next Story

Most Viewed