రైస్ మిల్ యజమాని అరెస్ట్...

by Taduka Kalyani |

మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలోని అరుణాచల రైస్ ఇండస్ట్రీ యజమానిని నేలకొండపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

రైస్ మిల్ యజమాని అరెస్ట్...
X

దిశ, నేలకొండపల్లి : మండలంలోని రాజేశ్వరపురం గ్రామంలోని అరుణాచల రైస్ ఇండస్ట్రీ యజమానిని నేలకొండపల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అందించాల్సిన బియ్యం సుమారు 442 మెట్రిక్ టన్నుల నిల్వలు తక్కువగా ఉన్నాయని తేల్చారు. ఈ విషయమై ఉన్నతాధికారుల ఆదేశాలతో సివిల్ సప్లై డీటీ నాగలక్ష్మి ఈ ఉదయం ఫిర్యాదు చేశారు. అయితే అనేక నాటకీయ పరిణామాల మధ్య ఈ సాయంత్రం మిల్లు యజమాని ఓరుగంటి కిరణ్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.

Next Story