- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మంలో తుమ్మల మాఫియా: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, ఖమ్మంబ్యూరో: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో అరాచకాలు, అక్రమాలు జరిగాయని తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు, ప్రస్తుతం అదే తరహా అరాచకాలు, మాఫియా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. రఘునాథపాలెం మండలంలో అనేక మట్టి గుట్టలను అక్రమంగా తవ్వి దోచుకుంటూ, ఇసుక, మట్టి మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పువ్వాడ విమర్శలు గుప్పించారు. తన ఆరోగ్యంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని, తనకు ఏదో జరిగిపోయినట్లుగా అసత్య వార్తలు ప్రచారం చేశారని అన్నారు. అయితే తాను ఆరు అడుగుల కటౌట్లా నిటారుగా నిలబడి ఉన్నానని, ప్రజల కోసం పోరాడే స్ఫూర్తితో ఎప్పటికీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే చరమగీతం పాడతారని, తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రజలతో కలిసి నిరంతరం పోరాటం కొనసాగిస్తానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.






