పర్ణశాల రామాలయం తాత్కాలిక మూసివేత

by velandi.Saikiran |

పర్ణశాల రామాలయం తాత్కాలిక మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా పర్ణశాలలోని శ్రీరామ

పర్ణశాల రామాలయం తాత్కాలిక మూసివేత
X

దిశ,దుమ్ముగూడెం : పర్ణశాల రామాలయం తాత్కాలిక మూసివేయనున్నారు. సెప్టెంబర్ 7వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా పర్ణశాలలోని శ్రీరామ ఆలయం మధ్యాహ్నం 1 గంటలకు తాత్కాలికంగా మూసివేయబడనున్నట్లు ఆలయ ఇంచార్జ్ అనిల్ కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు. గ్రహణం కారణంగా ఆలయంలో ఆ రోజు సాయంత్రం వరకు ఎటువంటి దర్శన లేదా కార్యక్రమాలు జరగవని, మరలా మరుసటి రోజు 8వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరవబడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలతో పాటు నిత్య ఆరాధన, నైవేద్యం వంటి ఆచారాలు యథావిధిగా నిర్వహించబడతాయన్నారు. ఆ తర్వాత ఉదయం 7:30 గంటల నుండి భక్తులకు శ్రీరామస్వామి దర్శనం కల్పించబడుతుందని ఆలయ ఇంచార్జ్ వెల్లడించారు.

Next Story