దిశ కథనంతో స్పందించిన అధికారులు

by Kodari Anjali |

దిశ కథనంతో ఎంపీడీవో కార్యాలయం అధికారులు స్పందించారు.

దిశ కథనంతో స్పందించిన అధికారులు
X

దిశ, చర్ల: దిశ కథనంతో ఎంపీడీవో కార్యాలయం అధికారులు స్పందించారు. కార్యాలయం గోడలపై ఉన్న పాత సర్పంచ్ ల పేర్లను తొలగించి కొత్తగా కొలువుదీరిన సర్పంచ్ ల పేర్లను చేర్చారు. ఈ నెల 23న దిశ దినపత్రికలో ఎంపీడీవో కార్యాలయం అధికారులు కొత్త సర్పంచ్ లను విస్మరించారు అనే కథనం వెలువడింది. అయితే ఈ కథనంతో స్పందించిన కార్యాలయం అధికారులు గోడలపై ఉన్న పాత సర్పంచ్ పేర్లను తొలగించి కొత్త సర్పంచ్ పేర్లను నమోదు చేశారు. తమ పేర్లను నమోదు చేయ్యడంతో సర్పంచ్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆవేదనను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపిన దిశకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story