Kammam: మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Kammam: మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసే వారు మూల్యం చెల్లించుకోకతప్పదని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. ఒక్క రోజు సైతం జై తెలంగాణ అనని నాయకులు స్థాయి మరిచి మంత్రి కేటీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భద్రాచలం ఎమ్మెల్యే ఎక్కడి నుంచో వచ్చారని.. అందుకే అక్కడ అభివృద్ధి చేయడం లేదని పువ్వాడ వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో ఖమ్మం జిల్లా లేకుండానే బీఆర్ఎస్ పార్టీ 85 సీట్లు గెలుస్తుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత రెండు ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్‌ను ఒక స్థానంలోనే గెలిపించారని ఈసారైనా ప్రజలు విజ్ఞతితో ఆలోచించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధిలో ఖమ్మం జిల్లా ప్రధాన పాత్ర పోషించకపోయినా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈసారైనా జిల్లా ప్రజలు కేసీఆర్‌కు అండగా నిలవాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరారు.

Next Story