జేఈఈ మెయిన్స్ లో కట్రం రక్షిత శ్రీ ప్రతిభ

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన కట్రం రక్షిత శ్రీ అనే విద్యార్థిని జేఈఈ మెయిన్స్ పేపర్ 1 పరీక్ష ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్ లో 95.699 పర్సంటేజ్ సాధించింది.

జేఈఈ మెయిన్స్ లో కట్రం రక్షిత శ్రీ ప్రతిభ
X

దిశ, అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన కట్రం రక్షిత శ్రీ అనే విద్యార్థిని జేఈఈ మెయిన్స్ పేపర్ 1 పరీక్ష ఫలితాల్లో ఆల్ ఇండియా లెవెల్ లో 95.699 పర్సంటేజ్ సాధించింది. విద్యార్థిని కట్రం రక్షిత శ్రీ ప్రస్తుతం ఫిడ్జ్ ఇంటర్ కాలేజ్ హైద‌రాబాద్ లోని మియాపూర్ లో విద్యనభ్యసిస్తున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని తండ్రి కట్రం స్వామి దొర టీడీపీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్ చార్జీగా వ్యవహరిస్తుండగా, తల్లి రాజేశ్వరి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. కట్రం రక్షిత శ్రీ ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు కట్రం స్వామి దొర-రాజేశ్వరి లు హర్షం వ్యక్తం చేశారు.

Next Story