జింకలపై కాల్పులు జరిపిన వేటగాళ్లు అరెస్ట్

by velandi.Saikiran |   (  Updated:2025-12-01 19:30:43  IST  )

సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కు, అటవీ ప్రాంతంలో అక్రమ వేట కార్యకలాపాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం

జింకలపై కాల్పులు జరిపిన వేటగాళ్లు అరెస్ట్
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్కు, అటవీ ప్రాంతంలో అక్రమ వేట కార్యకలాపాలు జరుగుతున్నాయనే విశ్వసనీయ సమాచారం అధికారుల‌కు అందింది. ఈ స‌మాచారం ఆధారంగా, జిల్లా టాస్క్ ఫోర్స్ సత్తుపల్లి అటవీ శాఖ అధికారులు సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, IFS & FDO మంజుల, ACF నేతృత్వంలో సంయుక్తంగా ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడులలో, అధికారులు నేరస్థులను గుర్తించి అరెస్టు చేశారు. అక్రమ వేటకు సంబంధించిన కీలక ఆధారాలను పొందారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.

TG ఫారెస్ట్ యాక్ట్–1967, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్–1972లోని సంబంధిత విభాగాల కింద వారిపై కేసులు నమోదు చేవారు. ప్రాథమిక దర్యాప్తులో, ఈ అక్రమ వేట సంఘటనలో మరికొంతమంది పాల్గొన్నట్లు తేలింది. వారిని గుర్తించి అరెస్టు చేయడానికి తదుపరి విచారణ జరుగుతోంది. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి & ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, సత్తుపల్లి ఆదేశాల మేరకు నిందితులను 12.12.2025 వరకు రిమాండ్‌కు తరలించారు.ఈ కేసు లో అటవీ శాఖ సిబ్బంది టాస్క్‌ఫోర్స్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డిఎఫ్‌ఓ హెచ్చరిక

అక్రమ వేట, అడవి జంతువులను చంపడం , అటవీ వనరులను నాశనం చేయడం వంటి చర్యలపై అటవీ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని డిఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ఇలాంటి అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ సిబ్బంది కి తెలియజేయాలని ప్రజలకు తెలిపారు.

Next Story