- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > Breaking: భద్రాచలం వద్ద పోటెత్తిన గోదావరి.. 47 అడుగులు దాటిన నీటిమట్టం
Breaking: భద్రాచలం వద్ద పోటెత్తిన గోదావరి.. 47 అడుగులు దాటిన నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఒక్కసారిగా పోటెత్తింది..

X
దిశ, వెబ్ డెస్క్:భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో గోదావరి నీటి మట్టం 47 అడుగులు దాటి పోయింది. ఈ రాత్రికి గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉందని, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తం 11,53,950 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసినట్లు వెల్లడించారు. మరోవైపు భద్రాచలం చుట్టు పక్కల ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. మత్య్సకారులు గోదావరి నదిలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Next Story






