నేలకొండపల్లి మండలంలో మాజీమంత్రి పర్యటన..

by Disha Web Desk 20 |
నేలకొండపల్లి మండలంలో మాజీమంత్రి పర్యటన..
X

దిశ, నేలకొండపల్లి : మండల పరిధిలోని పలుగ్రామాల్లో మంగళవారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. మండల టౌన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముత్తునేని వీరయ్యను పరామర్శించారు. అనంతరం పార్టీసీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమం కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కాసాని నాగేశ్వరరావు ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో నాగేశ్వరరావుని పరామర్శించారు.

అనంతరం పార్టీ నాయకులు తలశీల రాధాకృష్ణని పరామర్శించారు. తర్వాత ముఠాపురం గ్రామంలో పార్టీనాయకులు బెల్లం పుల్లయ్యని పరామర్శించారు. ఈ సందర్భంగా తుమ్మలకు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed