బీఆర్ఎస్ లో చేరిన మాజీ కౌన్సిలర్ భీమా శ్రీవల్లి దంపతులు

by velandi.Saikiran |

కొత్తగూడెం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బీమా శ్రీవల్లి, ఆమె భర్త బీమా శ్రీధర్ బుధవారం బీఆర్ ఎస్ లో చేరారు.

బీఆర్ఎస్ లో చేరిన మాజీ కౌన్సిలర్ భీమా  శ్రీవల్లి దంపతులు
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: కొత్తగూడెం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బీమా శ్రీవల్లి, ఆమె భర్త బీమా శ్రీధర్ బుధవారం బీఆర్ ఎస్ లో చేరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో బీమా దంపతులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ వారికి కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్,జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Next Story