ఎవరైతే మాకేంటి.. పిక్క కనిపిస్తే చాలు కొరికేస్తాం..

by Disha Web Desk 20 |
ఎవరైతే మాకేంటి.. పిక్క కనిపిస్తే చాలు కొరికేస్తాం..
X

దిశ, ముదిగొండ : గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పసి పిల్లల నుంచి పండు ముసలివాల్ల వరకు వారు వీరు అనే తేడా లేకుండా అందరిపైన దాడులు చేస్తున్నాయి. పిక్కకనిపిస్తే చాలు కుక్కలు రెచ్చిపోతున్నాయి. పూర్తివివరాల్లోకి వెళితే ముదిగొండ పరిధిలో పలు గ్రామాలలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్న, పెద్ద, ముసలి, ముతక అనేది ఏమి లేదు పిక్క కనిపిస్తే చాలు కుక్కలు దాడులు చేస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు భయబ్రాంతులకి గురవుతన్నారు.

ఈ పరిస్థితి ఒక్క ముదిగొండ మండలంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇవే సంఘటనలు కానొస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్తే చాలు వాటి వెనకాలే పరిగెత్తి ప్రమాదాలకి గురయ్యే విధంగా చేస్తున్నాయి. ద్విచక్ర వాహనాలపై వెళ్లాలంటే వామ్మో కుక్కలు కరుస్తాయేమో అన్ని భయపడే విధంగా కుక్కలు దాడులు చేస్తున్నాయి. ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని కాలనీలలో కుక్కల బెడద లేకుండా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed