ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వం కోసం డిప్యూటీ సీఎం సతీమణి దరఖాస్తు

by Disha Web Desk 15 |
ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వం కోసం డిప్యూటీ సీఎం సతీమణి  దరఖాస్తు
X

దిశ, వైరా : ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని దరఖాస్తు చేశారు. హైదరాబాద్ గాంధీ భవనం లో ఆమె దరఖాస్తు ను గురువారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ కాంగ్రెస్ జిల్లా నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైరా, కొణిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, వడ్డే నారాయణరావు, ఖమ్మం ఎస్సీ జిల్లా అధ్యక్షుడు బొందయ్య, జిల్లా నాయకులు నూతి సత్యనారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story