- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ అధ్యక్షున్ని కలిసిన నాయకులు
నాగులవంచ రైల్వే స్టేషన్ లో సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆఫీసులో మర్యాదా

దిశ, చింతకాని: నాగులవంచ రైల్వే స్టేషన్ లో సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆఫీసులో మర్యాదా పూర్వకంగా కలిసారు మండల నాయకులు. ఈ సందర్బంగా నాగులవంచ రైల్వే స్టేషన్ లో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు కూర్చోవడానికి బళ్లాలు,మంచినీటి సదుపాయాలు,విద్యుత్తు లైట్లు, బ్రిడ్జి సమస్యలపై వారికి వివరించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇక ఎన్ రామచంద్రరావు సానుకూలంగా స్పందించి రైల్వే వారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కొండా గోపి తో పాటు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు,కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు సోమగాని ఎల్లారావు గౌడ్,అమరనేని విజయ్,నాగులు, పరుశురాము తదితరులు పాల్గొన్నారు.






