- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లోయలోకి దూసుకెళ్లిన సిమెంట్ లారీ.. డ్రైవర్ దుర్మరణం
by velandi.Saikiran |
పూసుగూడెం గ్రామ శివారులో పాల్వంచ–దమ్మపేట ప్రధాన రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

X
దిశ, ములకలపల్లి: మండలంలోని పూసుగూడెం గ్రామ శివారులో పాల్వంచ–దమ్మపేట ప్రధాన రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలవరం నుంచి సూర్యాపేటకు సిమెంట్ యాష్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్, అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ మనోజ్ కుమార్ (ఉత్తరప్రదేశ్) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story





