పోలింగ్ బూత్​లను పరిశీలించిన అదనపు కలెక్టర్

by Disha Web Desk 15 |
పోలింగ్ బూత్​లను పరిశీలించిన అదనపు కలెక్టర్
X

దిశ, అన్నపురెడ్డిపల్లి : నూతన ఓటర్ నమోదు ప్రక్రియ అదేవిధంగా ఓటు మార్పులు చేర్పుల్లో భాగంగా మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లు ఏర్పాటు చేసిన సందర్భంలో రాజపురం అన్నపురెడ్డిపల్లి పోలింగ్ బూత్​లను అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న అధికారులు జాగ్రత్తగా ఓటు నమోదు ప్రక్రియ చేయాలని మరణాలు ఉంటే వాటిని తొలగించాలని చూసించారు. అనంతరం మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ప్రతి రోజూ మెను సరిగా ఉంటుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాలని వారికి సూసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed