గంజాయి మత్తులో స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పు

by Disha Web Desk 1 |
గంజాయి మత్తులో స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పు
X

ఖమ్మం నడిబొడ్డున అమానవీయ ఘటన

దిశ, ఖమ్మం రూరల్: గంజాయి మత్తులో తోటి స్నేహితుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఖమ్మం నగరంలో మయూరి సెంటర్లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జలగం నగర్ గ్రామానికి చెందిన కొమ్ము ధనుష్ అతని స్నేహితుడు ఫయాజ్ శనివారం రాత్రి మరికొందరితో కలిసి గంజాయి తాగి మయూరి సెంటర్లో ఘర్షణకు దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన ఫయాజ్ బండిలో ఉన్న పెట్రోల్ తీసి ధనుష్ ఒంటిపై పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాగా, సమాచారం తెలుసుకున్న నగర పోలీసులు ఫయాజ్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Next Story

Most Viewed