- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృంగిన బ్రిడ్జి.. పొంచి ఉన్న ప్రమాదం
by Kodari Anjali |
ఆళ్లపల్లి మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామపంచాయతీకి వెళ్లే రహదారి, బ్రిడ్జి కృంగిపోయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

X
దిశ, ఆళ్లపల్లి: ఆళ్లపల్లి మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామపంచాయతీకి వెళ్లే రహదారి, లక్ష్మిపురం గ్రామ శివారులో బ్రిడ్జి కృంగింది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి కృంగింది. ఆ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు కృంగిన బ్రిడ్జి పైనుంచి భయం భయంగా ప్రయాణిస్తున్నారు. వర్షాకాలం మొదలవుతుందని భారీ వర్షాలకు వరద ప్రవాహంతో బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉందని, దీంతో ప్రయాణాలు కొనసాగడం కష్టతరంగా మారుతుంది అని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ చూపించి, బ్రిడ్జి వద్ద మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






